రెడ్ బీ న్యూస్, 31 డిసెంబర్ 2021: దక్షిణాఫ్రికాతో త్వరలో జరుగనున్న వన్డే సిరీస్ కోసం తుది జట్టును బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. గాయం నుంచి కోలుకున్నా.. పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించకపోవడంతో వన్డే కెప్టెన్ రోహిత్ శర్మను పక్కన పెట్టింది. అతడి స్థానంలో కేఎల్ రాహుల్కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను వైస్ కెప్టెన్గా ఎంపిక చేసింది. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు కూడా రోహిత్ దూరమైన విషయం తెలిసిందే. మరోవైపు స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్లను కూడా సెలెక్షన్ కమిటీ పక్కన పెట్టింది. వీరి స్థానంలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, వాష్టింగ్టన్ సుందర్ను జట్టులోకి తీసుకుంది.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







