గంగవరం (రెడ్ బీ న్యూస్) 14 నవంబర్ 2021: విజ్ఞాన భాండాగారాలు గ్రంధాలయాలయాలని, విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఏర్పాటుచేసిన గ్రంధాలయాలు దేవాలయాల కన్నా గొప్పవాని విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు ఎంఎన్ పట్నాయక్, ఇంపాక్ట్ మోటివేషన్ ట్రైనర్ కె.రాంబాబు అన్నారు. స్థానిక శాఖా గ్రంథాలయంలో నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవాల్లో ఆదివారం పాల్గొని వారోత్సవాలు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చు కోవాలన్నారు. విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి పుస్తకాలు, పురాణ, ఇతిహాసాలు, నవల్స్, దినపత్రికలు అందుబాటులో ఉన్నాయని, అవి ఎంతో ఉపయోగకరమన్నారు. అన్నివర్గాలవారికి ఉపయోగపడే అన్నిరకాల పుస్తకాలు గ్రంధాలయంలో లభిస్తాయన్నారు. ఉన్నాయన్నారు. ఈనెల 18వ తేదీన పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు వ్యాసరచన, డిబేట్, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులతో కలిసి చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా సీనియర్ రెగ్యులర్ రీడర్ అయిన నరసింహమూర్తి పట్నాయక్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిణి జే. సత్యవతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







