గంగవరం (రెడ్ బీ న్యూస్) 5 నవంబర్ 2021:
యువత విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎంపీడీవో జాన్ మిల్టన్ ఎంఈవో మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ సీఎం కప్ క్రీడా పోటీలను శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు మండల స్థాయిలో గెలుపొంది డివిజన్ జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక అవ్వాలన్నారు. క్రీడల్లో రాణించే విద్యార్థులను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. కబడ్డీ, వాలీబాల్ పోటీలను ఎంపీపీ ప్రారంభించారు. బాలికల వాలీబాల్ పోటీలను సర్పంచ్ కలుముల అక్కమ్మ ప్రారంభించగా, ఎంపీటీసీ కబడ్డీ పోటీలను ప్రారంభించారు. 100 మీటర్ల పరుగు పందెం ఎంపీడీవో జాన్ మిల్టన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కె. రామతులసి, నెల్లిపూడి ఎంపీటీసీ కనకలక్ష్మి, డిప్యూటీ తహశీల్దార్ పి. రామకృష్ణ, రెవిన్యూ ఇనస్పెక్టర్ జిలాని, ఉపాధిహామీ ఏపివో సురేష్ కుమార్, ప్రధానోపాధ్యాయులు ఆర్.వి.వి సత్యనారాయణ, ఎం. అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







