గంగవరం (రెడ్ బీ న్యూస్) 31 అక్టోబర్ 2021: మండలంలోని ఆమదాలబందకు చెందిన చుండం వెంకటేశ్వర్లు వ్యవసాయ కూలీగా పని చేసుకుంటూ కొద్ది రోజుల క్రితం పాముకాటుకు గురై మృతి చెందాడు. అడ్డతీగల గురుకుల పాఠశాలలో 1998 పదవ తరగతి పూర్వ విద్యార్థులు తమ తోటి స్నేహితుడు మృతిచెందాడని తెలుసుకుని అతని కుటుంబ సభ్యులను ఆదివారం పరామర్శించారు. స్నేహితుని కుటుంబానికి రూ.12 వేల నగదు సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీతారపు నానాజీ, రాజబాబు, ప్రసన్నకుమార్, సత్యనారాయణ, వెంకట్రావు, గవాస్కర్, సింహాద్రి, సుబ్బారావు, శ్రీనుబాబు, కన్నయ్య, శ్రీనివాస్, సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







