గంగవరం (రెడ్ బీ న్యూస్) 29 నవంబర్ 2021: పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నూరు శాతం ఉండాలని మండల విద్యాశాఖాధికారి వై.మల్లేశ్వరరావు సూచించారు. మండలంలోని కొత్తాడలో కస్తూర్భా బాలికల విద్యాలయం, చిన్నగార్లపాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆయన సోమవారం తనిఖీ చేశారు. కస్తూర్భా పాఠశాలలో విద్యార్థులు హాజరు తక్కువ ఉండడాన్ని గమనించిన ఆయన నూరు శాతం హాజరు ఉండే విధంగా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు రికార్డులను తనిఖీ చేశారు. అలాగే వసతి గృహంలో స్టోర్ రూమ్, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. అలాగే మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుచేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారిణి పద్మావతి, సీఆర్పీ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







