కాకినాడ (రెడ్ బీ న్యూస్) 19 నవంబర్ 2021: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ భర్తీ చేయనున్న ఉద్యోగాల్లో కాకినాడ జీజీహెచ్, రంగరాయ వైద్య కళాశాలకు కలిపి మొత్తం 187 పోస్టులు మంజూరయ్యాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ 187 పోస్టుల్లో రంగరాయ వైద్య కళాశాలకు 21, జీజీహెచ్కు 166 పోస్టులు కేటాయించారు. ఆర్ఎంసీలో 2 ప్రొఫెసర్ పోస్టులు, 9 అసోసియేట్ ప్రొఫెసర్లు, 2 అసిస్టెంట్ ప్రొఫెసర్లు మొత్తం 13 పోస్టులు రెగ్యులర్ విధానంలో భర్తీ కానున్నాయి. మిగిలిన 8 పారామెడికల్ పోస్టులతో పాటు జీజీహెచ్లో 76 పారామెడికల్, 90 నర్సింగ్ పోస్టులు ఒప్పంద విధానంలో భర్తీ కానున్నాయి. ఆర్ఎంసీలో ఎమర్జెన్సీ మెడిసిన్, అడ్మినిస్ట్రేషన్కు ఇద్దరు ప్రొఫెసర్లు, ఆర్థో, సైకియాట్రీ, ఎమర్జెన్సీ మెడిసిన్, అడ్మినిస్ట్రేషన్, కార్డియాలజీ, సిటీ సర్జరీ, న్యూరాలజీ, యూరాలజీ విభాగాలకు 9 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, రేడియోథెరపీ, ఎమర్జెన్సీ మెడిసిన్ కోసం ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించనున్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







