కాకినాడ (రెడ్ బీ న్యూస్) 29 నవంబర్ 2021: జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్రావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. కాకినాడ ఎస్బీ సీఐ ఎన్.రజనీకుమార్ను కాకినాడ ఒకటో పట్టణ లా అండ్ ఆర్డర్కు, ఈ స్థానంలో పనిచేస్తున్న టి.రామ్మోహన్రెడ్డిని కాకినాడ పోర్టు స్టేషన్ సీఐగా బదిలీ చేశారు. పోర్టు స్టేషన్ సీఐ శ్రీనివాసరావును కాకినాడ ఎస్బీఎక్స్కు, రావులపాలెం సీఐ వి.కృష్ణను కాకినాడ మూడో పట్టణ లా అండ్ ఆర్డర్కు నియమించారు. కాకినాడ మూడో పట్టణ లా అండ్ ఆర్డర్ సీఐ శ్రీరామకోటేశ్వరరావును వీఆర్కు పంపారు. కృష్ణాజిల్లా నూజివీడు సర్కిల్ సీఐ ఎం.వెంకటరమణను రావులపాలెం, కాకినాడ రూరల్ సర్కిల్ సీఐ ఆకుల మురళీకృష్ణను సర్పవరం, తణుకు సీఐ డీఎస్ చైత్యన్యకృష్ణను కాకినాడ ట్రాఫిక్-2కు, తుని రూరల్ సర్కిల్ సీఐ కిశోర్బాబును ప్రత్తిపాడు సర్కిల్కు బదిలీలు చేశారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







