గంగవరం (రెడ్ బీ న్యూస్) 22నవంబర్ 2021: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం మండలంలోని నేలపాడులో నిర్మిస్తున్న పునరావాస కాలనీని సోమవారం మండల స్థాయి అధికారుల బృందం సందర్శించింది. పునరావాస కాలనీలో నిర్మించిన పాఠశాల, అంగనవాడీ, ఆరోగ్య ఉపకేంద్ర భవనాలను అధికారుల బృందం పరిశీలించింది. నిర్వాసితులు కాలనీలోకి వచ్చే సమయానికి పాఠశాలల నిర్వహణకు అనుకూలంగా ఉన్నది లేనిది పరిశీలించారు. అలాగే పునరావాస కాలనీలో అవసరమైన సదుపాయాలు గురించి వివరాలు సేకరించారు. ఈ పర్యటనలో తహశీల్దార్ శ్రీమన్నారాయణ, మండల విద్యాశాఖ అధికారి వై. మల్లేశ్వరరావు సీడీపీవో నీలవేణి, రెవెన్యూ ఇనస్పెక్టర్ జిలాని తదితరులు ఉన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







