న్యూఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 18 జనవరి 2022: వ్యాక్సినేషన్లో భారత్ మరో మైలురాయి దాటింది. 15 నుంచి 18 సంవత్సరాల వయసు గల వారిలో సగం మందికి తొలి డోసు టీకా వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నిన్నటికే మూడున్నర కోట్ల మందికి టీకా వేసినట్లు కేంద్రం ప్రకటించింది. అంతేకాదు ఆరోగ్య రంగ సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 60 సంవత్సరాలు పై బడిన వారికి 50 లక్షలకు పైగా డోసులు ఇచ్చినట్లు వెల్లడించింది.