వినుకొండ (రెడ్ బీ న్యూస్) 7 జనవరి 2022 : ఆంధ్రప్రదేశ్లో మార్చి నెలలో పదో తరగతి పరీక్షలు తప్పనిసరిగా నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా వినుకొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 7 సబ్జెక్టులతో పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. సీబీఎస్ఈ సిలబస్ వీలైనంత త్వరగా ప్రారంభిస్తామన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి సీబీఎస్ఈలో పదో తరగతి మొదటి బ్యాచ్ పరీక్ష నిర్వహించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.