పెద్దాపురం: తెలుగు సంవత్సరాది విశిష్టతను తెలియజేస్తూ ప్రాచీనాంధ్ర సాహిత్యంలో మేరు శిఖరాలు పేరిట ముద్రించిన పుస్తకాలను స్థానిక శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్ విద్యార్థులు జిల్లాలోని ప్రముఖులకు, అధికారులకు అందచేశారు. జిల్లా కలెక్టర్ హెచ్. అరుణ్ కుమార్, ఎస్పీ రవిప్రకాష్, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ , బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, తో పాటు కాకినాడ, పెద్దాపురం, రాజమహేంద్రవరం, తుని, పాయకరావుపేటల్లో పలువురు అధికారులు, ప్రముఖులకు ఈ పుస్తకాలను అందచేశారు. ప్రాచీన సాహిత్యంతో పాటు నన్నయ నాటి నుండి కంకటి వరకు గల కవుల సాహిత్య రచనల పై సమీక్ష తో ముద్రించిన పుస్తకం ద్వారా ఉగాది విశిష్టతతో పాటు హేవలంభి శుభాకాంక్షలు తెలియచేసారు.