UPDATED 19 APRIL 2022 TUESDAY 06:00 AM
Tirumala Sriveri Mettu : శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త తెలిపింది. 2021 నవంబర్ లో భారీగా కురిసిన వర్షాలకు శ్రీవారి మెట్లు మార్గం ధ్వంసమైన విషయం తెలిసిందే. ఆ మార్గానికి మరమత్తులు చేపట్టిన టీటీడీ ఆ మార్గాన్ని తెరుస్తోంది. భారీగా కురిసిన వర్షాలకు ధ్వంసమైన శ్రీవారి మెట్టు మార్గాన్ని ఐదు నెలల నుంచి టీటీడీ మూసివేసింది.
దానికి మరమత్తులు చేపట్టింది. ఈక్రమంలో శ్రీవారి మెట్టు మార్గాన్ని మే 1 నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది. శ్రీవారి మెట్లు మార్గం ప్రస్తుతం భక్తులకు అందుబాటులో ఉన్న అలిపిరి నడక మార్గం ద్వారానే పైకి వెళుతున్నారు. తాగా శ్రీవారి మెట్టు మార్గం అందుబాటులోకి రానున్న క్రమంలో భక్తులు ఈ మార్గాన్ని ఉపయోగించుకోచ్చు. దీంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో ఈ నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకోవచ్చు. కాగా..వరుస సెలవులు రావటంతో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తారు.