అన్నవరం (రెడ్ బీ న్యూస్) 24 అక్టోబరు 2021: రత్నగిరిపై ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సత్యదేవ నిత్యాన్నదాన పథకానికి ఆదివారం ఒకదాత రూ.లక్ష విరాళంగా సమర్పించారు. తునికి చెందిన వరదరాజు ఈ మొత్తాన్ని ఆలయ ఈవో త్రినాథరావుకు అందజేశారు. దీనిపై వచ్చే వడ్డీతో ప్రతీఏటా ఫిబ్రవరి 27న అన్నదానం జరిపించాలని కోరారు. దాతను ఈవో అభినందించారు







