UPDATED 20TH MAY 2017 SATURDAY 6:30 PM
పెద్దాపురం: అన్నవరం దేవస్థానం పాలకమండలి సభ్యుడుగా నియమితులైన కందుల విశ్వేశ్వరరావు హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్పను స్థానిక అర్ అండ్ బి అతిధి గృహంలో మర్యాదపూర్వకంగా శనివారం కలిసుకున్నారు. ఈ మేరకు ఆయనకు పుష్పగుచ్చాన్ని అందించి కృతజ్ఞతలు తెలియచేశారు. అనంతరం హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధికి కృషి చెయ్యాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రాజా సూరిబాబురాజు, ఎంపిపి గుడాల రమేష్, సామర్లకోట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాలకుర్తి శ్రీనుబాబు, బొడ్డు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.







