UPDATED 4 FEBRUARY 2022 FRIDAY 04:30 PM
కాకినాడ (రెడ్ బీ న్యూస్): ఏపీ సీఎం కాపు ఉద్యమ నేత,జగన్కు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కాపు ఉద్యమంలో పెట్టిన కేసులు కేబినెట్ మీటింగ్ లో పెట్టి ఉపసంహరించినందుకు సీఎం జగన్ కు ముద్రగడ ధన్యవాదాలు తెలిపారు. తాము చెయ్యని నేరానికి తమను ముద్దాయిలను చేస్తూ పెట్టిన కేసులు చాలా అన్యాయమని.. తమ జాతి తనను ఉద్యమం నుంచి తప్పించినా మీరు ఆ కేసుల్ని ఎత్తివేసినందుకు ధన్యావాదాలు అని లేఖలో ముద్రగడ పేర్కొన్నారు. కేసులు ఉపసంహరించటం వల్ల తనకు చాలా సంతోషంగా ఉందని.. తెలిపారు.
ఈ రెండు విషయాల్లో ఆనందం పొందలేని జీవితమని.. తనకు జరిగిన అవమానాలు, బాధలు, కష్టాలు, బూతు పురాణాలు వీటిని ఎవరైనా ద్రుష్టిలో పెట్టుకుంటే భవిష్యత్లో ఉద్యమాలు చేయడానికి ఎవరూ రోడ్డు మీదకు రారన్నారు. ఏపీ సీఎం కాపు ఉద్యమ నేత,జగన్కు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కాపు ఉద్యమంలో పెట్టిన కేసులు కేబినెట్ మీటింగ్ లో పెట్టి ఉపసంహరించినందుకు సీఎం జగన్ కు ముద్రగడ ధన్యవాదాలు తెలిపారు.
తాము చెయ్యని నేరానికి తమను ముద్దాయిలను చేస్తూ పెట్టిన కేసులు చాలా అన్యాయమని.. తమ జాతి తనను ఉద్యమం నుంచి తప్పించినా మీరు ఆ కేసుల్ని ఎత్తివేసినందుకు ధన్యావాదాలు అని లేఖలో ముద్రగడ పేర్కొన్నారు.కేసులు ఉపసంహరించటం వల్ల తనకు చాలా సంతోషంగా ఉందని.. తెలిపారు.
అప్పుడు సీఎంగా నారా చంద్రబాబు బీసీ-ఎఫ్ ఫైలును కేంద్రానికి ఆమోదం కోసం పంపిస్తున్నప్పుడూ.. ఇప్పుడు కాపులపై కేసులు ఎత్తివేసినప్పుడు తానే స్వయంగా వచ్చి అప్పుడు, ఇప్పుడు ధన్యవాదాలు చెప్పాలనుకున్నానని లేఖలో ప్రస్తావించారు ముద్రగడ. కానీ అందరిలా తాను అపరకోటీశ్వరుడ్ని కాదని.. సమాజం పోకడ మాత్రం ఇద్దర్ని అంటే అప్పుడు చంద్రబాబును ఇపప్పుడు జగన్ ను తాను కలిస్తే తమవారు (అంటే కాపులు అని కావచ్చు) పదవుల కోసమే అని అనుకుంటారని అందుకే వెళ్లలేకపోయానని తెలిపారు.







