అమరావతి (రెడ్ బీ న్యూస్) 31 డిసెంబర్ 2021: మందుబాబులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేటి నుంచి రాష్ట్రంలో ప్రీమియం బ్రాండ్ల మద్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అబ్కారీ శాఖ వెల్లడించింది. ఆ మద్యాన్ని ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్కు చెందిన రిటైల్ ఔట్లెట్లలో విక్రయించనున్నట్లు తెలిపింది. బార్లు, వాక్ ఇన్ స్టోర్లలో ప్రీమియం బ్రాండ్లు విక్రయించాలని నిర్ణయించింది. ప్రీమియం బ్రాండ్ల విక్రయంపై ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.







