UPDATED 7th SEPTEMBER 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: శ్రావణమాసం ఆఖరి శుక్రవారం పురస్కరించుకుని స్థానిక పంచారామక్షేత్రమైన శ్రీ కుమారరామ భీమేశ్వరస్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ పూజా కార్యక్రమంలో మహిళలకు దేవస్థానం అధికారులు రూపులు, పూజాసామాగ్రి అందచేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఇవో పులి నారాయణమూర్తి, అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు.







