Chegondi Harirama Jogaiah Fast : రంగంలోకి పవన్ కల్యాణ్.. దీక్ష విరమించిన హరిరామ జోగయ్య

Updated 2nd January 2023 Monday 7:10 pm

Chegondi Harirama Jogaiah Fast : హరిరామ జోగయ్య దీక్ష విరమించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచనలతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దీక్ష విరమించారు. నిమ్మ రసం ఇచ్చి హరిరామ జోగయ్యతో దీక్ష విరమింపజేశారు కాపు సంక్షేమ సేన నాయకుడు, జనసేన నేత దాసరి రాము. కాసేపట్లో పాలకొల్లు బయలుదేరనున్న హరిరామ జోగయ్య.

సీనియర్ రాజకీయవేత్త చేగొండి హరిరామజోగయ్య కాపు రిజర్వేషన్ల సాధన కోసం నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. 85 ఏళ్ల హరిరామజోగయ్య నిరాహార దీక్షకు దిగడం పట్ల ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం ఆయన దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించింది. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఆసుపత్రిలో కూడా దీక్షను కొనసాగించారు. దీంతో అక్కడ హైటెన్షన్ నెలకొంది.

ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ ఎంట్రీ ఇచ్చారు. నిరాహార దీక్ష చేస్తున్న హరిరామజోగయ్యకు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ మూర్ఖపు ప్రభుత్వం నిరాహార దీక్షలకు లొంగదని ఆయనకు చెప్పినట్లు పవన్ వివరించారు. వయసు, ఆరోగ్యం దృష్ట్యా దీక్ష విరమించాలని సూచించినట్టు తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us