తిరుచానూరు (రెడ్ బీ న్యూస్) 8 జనవరి 2022 :తమిళనాడు రాష్ట్రం మధురైకి చెందిన డాక్టర్ శ్రీనివాసన్ రూ. 66.8లక్షల విలువగల బంగారు కాసుల హారాన్ని తిరుచానూరులోని శ్రీవారి దేవేరి పద్మావతీ దేవికి కానుకగా సమర్పించారు. 1.302గ్రాముల బరువుగల ఈ హారాన్ని ఆలయ ఏఈవో ప్రభాకర్రెడ్డికి శుక్రవారం నగరి ఎమ్మెల్యే రోజాతో కలసి దాత తరపు ప్రతినిధి కార్తీక్, హారం తయారీదారులు ధనశేఖర్, పాండియన్ అందజేశారు.విశేష పర్వదినాల్లో ఈ హారాన్ని అమ్మవారికి అలంకరించనున్నట్లు అర్చకులు తెలిపారు.







