చిత్తూరు (రెడ్ బీ న్యూస్) 8 డిసెంబర్ 2021: అమరావతి రైతుల ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పాదయాత్ర 38వ రోజుకు చేరింది. బుధవారం చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు మండలం చింతలపాలెం నుంచి ప్రారంభమైంది. ఈరోజు రాజులపాలెం, పంగూరు, కాట్రకాయలగుంట మీదుగా శ్రీకాళహస్తి మండలంలోని విష్ణుకెమికల్స్, గుంటకిందపల్లి, జింగిలిపాళెం, ముళ్లపూడి ఎస్టీ కాలనీ, ఊరందూరు, విశాలాక్షి నగర్, పానగల్ మీదుగా శ్రీకాళహస్తి పట్టణం వరకు పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి శ్రీకాళహస్తిలో రైతుల బస చేయనున్నారు.







