Updated 9th February 2023 Thursday 6:15 pm
Nara Lokesh Padayatra : నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై కేసు నమోదైంది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులోని నరసింగరాయిని పేటలో అనుమతి లేకుండా లోకేశ్ మీటింగ్ పెట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. లోకేశ్ సహా టీడీపీ నేతలపై 188, 341, 290 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.
అంతకుముందు సంసిరెడ్డి పల్లెలో కూడా ఉద్రిక్తత ఏర్పడింది. పాదయాత్రలో నారా లోకేశ్ ను పోలీసులు అడ్డుకున్నారు. లోకేశ్ మాట్లాడుతుండగా.. మైక్ లాక్కున్నారు. దీంతో పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
సంసిరెడ్డిపల్లెలో సుమారు గంటపాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల వైఖరిపై మండిపడుతూ.. స్టూల్ పై చాలాసేపు నిల్చుని నిరసన వ్యక్తం చేశారు నారా లోకేశ్. భారత రాజ్యాంగానికి సంబంధించిన ఒక పుస్తకాన్ని కూడా పోలీసులకు చూపించారు. ఇక రాజారెడ్డి రాజ్యాంగం నడవదు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుందంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు నారా లోకేశ్.







