UPDATED 13th JULY 2022 WEDNESDAY 05:00 PM
Digital Payments : టీటీడీలో విప్లవాత్మకమైన మార్పు తీసుకు వచ్చారు. నగదు చెల్లింపు స్ధానంలో UPI విధానాన్ని ప్రవేశ పెడుతున్నారు. టీటీడీ పైలట్ ప్రాజెక్ట్ కింద వసతి గదుల కేటాయింపు సమయంలో UPI విధానం అందుబాటులోకి తీసుకు వస్తోంది. దీంతోపాటు వసతి గదులు ఖాళీ చేసే సమయంలోనూ భక్తులకు వేగవంతంగా నగదు చెల్లించేందుకు UPI విధానాన్నే అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. UPI విధానం అందుబాటులోకి వస్తే టీటీడీలో అవకతవకలకు అవకాశం ఉండదని భావిస్తున్నారు.







