కిలో ‘గోల్డ్‌ టీ’ పొడి ధర రూ. 99,999.. వేలంలో రికార్డు

గువాహటి (రెడ్ బీ న్యూస్) 14 డిసెంబర్ 2021: భారత్‌లో చాయ్​కు ఉన్న ఆదరణే వేరు. అందులోనూ అస్సాం టీ పొడికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే అక్కడ ఉత్పత్తయ్యే చాయ్‌ పొడికి మంచి డిమాండ్​ ఉంటుంది. పలు అరుదైన రకాలకు చెందిన టీ పొడులను ఏటా పలు సంస్థలు వేలం వేస్తాయి. ఈ క్రమంలో మంగళవారం ‘మనోహరి గోల్డ్​ టీ’ రికార్డు ధర​ నమోదు చేసింది. వేలంలో కిలో టీ పొడి రూ. 99,999కు అమ్ముడుపోయింది. దేశంలో ఇప్పటివరకు ఇదే అత్యధిక ధర. ఈ గోల్డ్​​ టీని మనోహరి టీ ఎస్టేట్స్‌ నుంచి సౌరవ్​ టీ ట్రేడర్స్​ అనే సంస్థ కొనుగోలు చేసినట్లు గువాహటి టీ వేలం సెంటర్​ (జీటీఏసీ) కార్యదర్శి ప్రియాన్ష్‌ దత్తా వెల్లడించారు. టీ పొడి కొనుగోలు, విక్రయాల్లో దేశంలోనే ఇది అత్యధిక ధర అని ఆయన తెలిపారు. ఈ తరహా టీలకు విదేశాల్లో కూడా డిమాండ్​ పెరుగుతుందని ఆశిస్తున్నానని దత్తా పేర్కొన్నారు. పసుపు రంగులో ఉండి అద్భుతమైన రుచిని అందించే మనోహరి గోల్డ్‌ టీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని పేరుంది. 2019 జులైలో వేలం నిర్వహించగా ఈ పొడి కేజీ రూ. 50వేలకు అమ్ముడుపోయి రికార్డు నెలకొల్పింది. అయితే కొద్దిరోజులకే ఈ రికార్డు బద్దలైంది. ‘గోల్డెన్‌ నెడ్డిల్స్‌ టీ’తోపాటు ‘గోల్డెన్‌ బటర్‌ఫ్లై టీ’లు రూ. 75వేలకు అమ్ముడుపోయాయి. కాగా ఈ రికార్డును ప్రస్తుతం మనోహరి గోల్డ్‌ టీ తిరగరాసింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us