Tirumala : తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. అక్టోబర్ 15 నుండి 23 వరకు

Updated 13th October 2023 Friday 8:10 am

Tirumala Srivari Navaratri Brahmotsavam : తిరుమలలో అక్టోబర్ 15 నుండి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శనివారం అంకురార్పణ జరుగనుంది. పెరటాసి నెల, దసరా సెలవుల నేపథ్యంలో భారీగా భక్తులు వస్తారని టీటీడీ అంచనా.

నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 19న జరిగే గరుడవాహన కార్యక్రమాన్ని సాయంత్రం 6.30 గంటల నుండి ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. అక్టోబర్ 14 నుండి 23 తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలను రద్దు చేసింది.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 22 కంపార్ట్ మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 65,937 భక్తులు దర్శించుకున్నారు. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.28 కోట్లు వచ్చింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us