సూడాన్ (రెడ్ బీ న్యూస్) 29 డిసెంబర్ 2021: ఆఫ్రికా దేశమైన సూడాన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బంగారు గని కూలి 38 మంది చనిపోయారు. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సూడాన్ రాజధాని ఖార్టోమ్కు 700 కిలో మీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మూసివేసిన బంగారు గనిలో ఈ ఘటన జరిగినట్లు సూడాన్ మైనింగ్ కంపెనీ తెలిపింది. ఎనిమిది మంది మంది గాయపడినట్లు వెల్లడించింది.
గత కొంతకాలం క్రితం ఈ గని తవ్వకాన్ని ప్రభుత్వం మూసివేసింది. అయితే బంగారం కోసం స్థానిక ప్రజలు తరుచుగా గనిలోకి వెళుతుంటారు. గనులు కూలకుండా ఉండేందుకు ప్రభుత్వం కనీస భద్రతా సౌకర్యాలు సైతం కల్పించడం లేదు. దీంతో సూడాన్లో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. ఆఫ్రికా ఖండంలో బంగారం వెలికితీసే దేశాల్లో సూడాన్ ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది. 2020లో ఈ దేశం 36.6 టన్నుల బంగారాన్ని వెలికితీసింది.







