UPDATED 23rd APRIL 2020 THURSDAY 5:00 PM
సామర్లకోట (రెడ్ బీ న్యూస్): సామర్లకోట పట్టణంలో కరోనా పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు, తహసీల్దార్ వజ్రపు జితేంద్ర, పోలీస్ అధికారులతో కలిసి పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతాన్ని గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా గుర్తించి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. అనంతరం సామర్లకోట పట్టణంలో ఈటీసీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించి డాక్టర్లకు తగు సూచనలు చేశారు.







