UPDATED 7th APRIL 2022 THURSDAY 06:20
PM CM Jagan: సీఎం వైఎస్ జగన్ శుక్రవారం (ఏప్రిల్8, 2022)న నంద్యాలలో పర్యటించనున్నారు. ఎస్పీజీ గ్రౌండ్ నంద్యాలలో జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సీఎం జగన్ బయలుదేరనున్నారు.
సీఎం జగన్ ఉదయం 11.10 గంటలకు నంద్యాల గవర్నమెంట్ డిగ్రీకాలేజీకి చేరుకుంటారు. 11.35 – 12.35 గంటల మధ్య ఎస్పీజీ గ్రౌండ్కి చేరుకుని, జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.12.45 గంటలకు నంద్యాల నుంచి సీఎం జగన్ తిరుగుపయనం కానున్నారు. మధ్యాహ్నం 2.25 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.







