అమరావతి (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022 : ఏపీలో కొవిడ్ థర్డ్ వేవ్ రోజు రోజుకీ ఉద్ధృతమవుతోంది. తాజాగా... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన స్వల్ప లక్షణాలతో హైదరాబాద్ లోని నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా వెంటనే టెస్టులు చేయించుకోవాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని రామకృష్ణ కోరారు.







