UPDATED 25th FEBRUARY 2022 FRIDAY 04:00 PM
AP CS Sameer Sharma : ఉక్రెయిన్ లో తెలుగు వాళ్ళ కోసం సీఎం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చెయ్యమన్నారని ఏపీ చీప్ సెక్రటరీ సమీర్ శర్మ తెలిపారు. కృష్ణ బాబు, అరుణ్ కుమార్, దినేష్ కుమార్, గీతేష్ శర్మలతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. 1902కి కాల్ చేసి పిల్లల వివరాలు తెలపొచ్చని, ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాల్లో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు.
అక్కడికి చేరే వారిని రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు, 48660460814, 48606700105 నంబర్లకు ఫోన్ చేయవచ్చన్నారు.
వారిని సమన్వయ పరిచేందుకు ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు, ఇప్పటికి 130 మంది కాల్ చేశారన్నారు. వెయ్యి మంది తెలుగు విద్యార్థులు ఉంటారని, ప్రతి కలెక్టర్ ఆఫీస్ లో జిల్లా సెల్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.







