పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 18 నవంబర్ 2021 : మండంలోని ఆర్బీ కొత్తూరు గ్రామంలో అక్రమంగా ఓ ఇంట్లో నిల్వ ఉంచిన రెండున్నర టన్నుల పీడీఎస్ బియ్యాన్ని రెవెన్యూ, సివిల్ సప్లైస్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని అక్రమంగా తరస్తున్న సమయంలో గ్రామస్తులు చూసి అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎమ్మెస్వో లక్ష్మీకుమారి, ఆర్ఐ రాఘవరావు అక్కడకు చేరుకుని బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసును నమోదు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.







