పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 2 నవంబర్ 2021: బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న నాలుగు టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పెద్దాపురం మండలం కట్టమూరులో పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా బొలేరో వాహనం అనుమానంగా కనిపించడంతో.. తనిఖీ చేయగా నాలుగు టన్నులు రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. దీంతో బియ్యంతో ఉన్న వాహనాన్ని స్వాధీనం చేసుకుని సివిల్ సప్లైస్ అధికారుల సమక్షంలో సీజ్ చేసినట్లు ఎస్ఐ మురళీమోహన్ తెలిపారు.







