UPDATED 14th MAY 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ బాలా త్రిపురసుందరీ సమేత కుమారరామ భీమేశ్వరస్వామి ఆలయంలో మాసశివరాత్రి పురస్కరించుకుని కంచి మహా సంస్థానం అధ్యక్షులు చంద్రాభట్ల చింతామణి గణపతిశాస్త్రి ఆధ్వర్యంలో సోమవారం లక్షపత్రి పూజ, అలాగే అమ్మవారికి విశేష కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పాల్గొన్నారు. పూజలు అనంతరం ప్రసాదవితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్ (బాబు), సభ్యులు మహంకాళి వెంకటగణేష్, పడాల వీరబాబు, డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్, ఆలయ కార్యనిర్వహణాధికారి పులి నారాయణమూర్తి, పండితులు వేమూరి సోమేశ్వర శర్మ, భమిడిపాటి శ్రీనివాసశర్మ, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.







