UPDATED 24th JULY 2022 SUNDAY 02:40 PM
TTD: హిందూ ధర్మప్రచారంలో భాగంగా జానపద కళలను పరిరక్షించి అవి అంతరించిపోకుండా కాపాడేందుకు టిటిడి కృషి చేస్తోంది. ఇందులో భాగంగా కరోనా కారణంగా తిరుమలలో గత కొంత కాలంగా నిలిచిపోయిన అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని ఆగస్టు 1వ తేదీ నుండి తిరిగి ప్రారంభించనుంది. వివిధ ప్రాంతాల నుండి జానపద కళాకారులు తిరుమలకు విచ్చేసి అన్నమయ్య, త్యాగయ్య తదితర వాగ్గేయకారుల భజనలు, కీర్తనలు ఆలపిస్తారు.







