UPDATED 18th JULY 2022 MONDAY 06:25 PM
Andhra Pradesh: రాష్ట్రపతి ఎన్నిక కోసం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం నిర్వహించిన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఏపీ అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలకు గాను, 172 మంది శాసన సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏపీకి చెందిన వైసీపీ ఎమ్మెల్యే మహీధర రెడ్డి హైదరాబాద్లో ఉండటంతో తెలంగాణ శాసన సభలో ఓటు వేశారు.
టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. టీడీపీ ఎమ్మెల్యేలు నందమూరి బాలకృష్ణ, బుచ్చయ్య చౌదరి విదేశాల్లో ఉన్న కారణంగా ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని సమాచారం. కరోనా లక్షణాల కారణంగా గుంటూరు ఎమ్మెల్యే మద్దాల గిరి, పీపీఈ కిట్ ధరించి వచ్చి ఓటు వేశారు. ఎన్నికల ప్రక్రియ సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది. అయితే, అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ రావడంతో ఏపీ అసెంబ్లీలో మధ్యాహ్నం 03:15 గంటలకే ఓటింగ్ ప్రక్రియ పూర్తైంది.







