మధ్యప్రదేశ్ (రెడ్ బీ న్యూస్) 26 నవంబర్ 2021: ఉధంపూర్-దుర్గ్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. రెండు బోగీల్లో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. మధ్యప్రదేశ్లోని హేతంపూర్ రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరిన కాసేపటికే మంటలు చెలరేగాయి. బోగీల నుంచి ప్రయాణికులను ఖాళీ చేయించడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది, అధికారులు మంటలు వ్యాపించిన బోగీలను వేరు చేశారు. ప్రమాదం జరిగిన మార్గంలో రైల్వే అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.







