UPDATED 17th MARCH 2022 THURSDAY 07:00 AM
BJP To Protest : తెలంగాణ బీజేపీ నేతల దీక్షపై ఉత్కంఠ నెలకొంది. 2022, మార్చి 17వ తేదీ గురువారం ఇందిరాపార్కు వద్ద ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేల సస్పెన్షన్ కు నిరసనగా ఈ దీక్ష చేయాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఈ దీక్షపై పోలీసులు పలు నిబంధనలు, ఆంక్షలు విధించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే దీక్ష చేయాలని, దీక్షలో 200 మందికి మించకూడదని షరతు విధించింది. ఎన్ని ఆంక్షలు పెట్టినా, నిర్బంధాలు విధించినా దీక్షను కొనసాగిస్తామని రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రకటించారు.







