కర్నూలు (రెడ్ బీ న్యూస్) 12 జనవరి 2022 : జిల్లాలోని ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లి పంట పొలాల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. రామలక్ష్మయ్య అనే రైతు... పంటకు నీరు అందించి బైక్పై వెళ్తుండగా చిరుత ఎదురుపడింది. దీంతో రామలక్ష్మయ్య తీవ్ర భయాందోళనకు గురై అక్కడి నుంచి తప్పించుకున్నాడు. పులి సంచారంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. రైతులు, గ్రామస్తులు పులి కోసం పంట పొలాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.







