UPDATED 4th JUNE 2017 SUNDAY 10:30 PM
అంబాజీపేట: చంద్రబాబు ప్రభుత్వం కాపులకు ఇచ్చిన హామీలు తక్షణం అమలు చేయాలని కోరుతూ జూలై 26వ తేదీ నుంచి తలపెట్టిన పాదయాత్రను విజయవంతం చేయాలని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. కిర్లంపూడి నుంచి అమరావతి వరకు నిర్వహించే ఈ పాదయాత్రలో యువకులు ఆధికసంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. అంబాజీపేట శివారు కొర్లపాటివారిపాలెంలోని ఒక కార్యక్రమానికి విచ్చేసిన ముద్రగడ ఇక్కడి కాపు యువకులతో కొద్దిసేపు మాట్లాడారు. ప్రభుత్వం కాపులకు ఇచ్చిన అన్ని హామీలు తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు.







