UPDATED 2nd NOVEMBER 2022 WEDNESDAY 09:40 PM
Bommanhal Electric Shock Incident : అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలంలో విద్యుత్ వైర్లు తెగిపడి నలుగురు మహిళా వ్యవసాయ కూలీలు మృతి చెందడం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించింది. విద్యుత్ శాఖకు చెందిన ముగ్గురు ఉద్యోగులపై వేటు వేసింది. ఏడీ, ఏఈ, లైన్ ఇన్ స్పెక్టర్ ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.







