★ కేంద్రం మంజూరు చేసినట్టు ఎంపీ భరత్ వెల్లడి
రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 27 డిసెంబర్ 2021: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి కేంద్రం ఔటర్ రింగ్రోడ్డు మంజూరు చేసినట్టు ఎంపీ మార్గాని భరత్ వెల్లడించారు. కేంద్ర ఉపరితల రవాణాశాఖ నుంచి ఈమేరకు ఉత్తర్వులు అందాయని చెప్పారు. రాజమహేంద్రవరంలో రూ.1000 కోట్లతో 25 నుంచి 30కి.మీల మేర ఈ రింగ్రోడ్ నిర్మాణం జరగనుందని వివరించారు. ఈ నగరానికి రింగ్రోడ్ రావడం ఎంతో గర్వకారణమన్నారు.







