రంపచోడవరం:5 జూన్ 2020.(రెడ్ బీ న్యూస్): గ్రామ వాలంటీర్లు ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వానికి నమ్మకమైన సేవకులుగా పనిచేయాలని
స్థానిక శాసనసభ్యురాలు నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. స్థానిక ఎంపీడివో కార్యాలయంలో గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాల సిబ్బందితో వివిధ పథకాలు అమలుతీరు,
గ్రామస్థులకు అందిస్తున్న సేవా కార్యక్రమాలపై పురోగతిని గ్రామ సచివాలయాలు వారీగా శుక్రవారం సమీక్షించారు. ఈ
సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ స్థాయిలో సేవలందించు వివిధ ప్రభుత్వ శాఖల మధ్య చక్కని సమస్వయం సాధించేందుకు గ్రామ సచివాలయాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయన్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు ఇంటి ముంగిట ప్రభుత్వ సేవలు అందించే దిశగా గ్రామ వాలంటీర్లు వ్యవస్థ, గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ వ్యవస్థల ద్వారా ప్రభుత్వ పధకాలను, కార్యక్రమాలను, సేవలను అవినీతి రహితంగా ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రజల ముంగిటకు అందించడంలో గ్రామ వాలంటీర్లు సచివాలయాలు సిబ్బంది కీలక పాత్ర పోషించాలని ఆమె
సూచించారు. జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షుడు అనంత ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ సకాలంలో గ్రామ స్థాయి ప్రణాళికలు సమగ్రంగా అమలు పరచాలని సిబ్బందికి సూచించారు. గ్రామ వాలంటీర్లు వ్యవస్థను గ్రామ సచివాలయ వ్యవస్థతో సమీకృత
పరుస్తూ ప్రజలకు సమర్ధవంతంగా సేవలందించాలన్నారు. సిటిజన్ చార్టరును చక్కగా నిర్వహించుట, పారదర్శకత.
జవాబుదారీతనంతో ప్రభుత్వ సేవలను అందించాలన్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులతో త్రాగునీటి సమస్యలు
పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. అమ్మఒడి, రైతు భరోసా, జగనన్న విద్యాదీవెన, వాహన మిత్ర,టైలరింగ్, సామాజిక భద్రతా పింఛన్లు, పాస్టర్లకు ప్రభుత్వ సాయం ఏమేరకు అందింది, మిగిలినవారి విషయలో ఉత్పన్నమైన సాంకేతిక సమస్యలను అధిగమించి అర్హులందరికి న్యాయం చేకూర్చాలని తెలిపారు. ప్రభుత్వపరంగా ప్రజలకు కావాల్సిన అవసరాలు, సేవలు, సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి వర్తింపజేసి ఆయా సంక్షేమ ఫలాలను అందించడం వంటి విషయాలను, గ్రామ వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి
సమస్యలు సేవలు తెలుసుకొని గ్రామ సచివాలయాలు సహకారంతో నిర్ణీత కాలవ్యవదిలో వాటి పై చర్యలు
తీసుకోవాలన్నారు.
ప్రజలకు ఓర్పు సహనంతో సేవలు అందించాలని, విధుల ఈ కార్యక్రమంలో ఆర్.డబ్ల్యూ. ఎస్. డీఈ రవీంద్రబాబు, ఎఈ రాజు, ట్రాన్స్ కో ఎఈ దొరబాబు, మాజీ ఎంపీపీ ఎ. సత్యనారాయణ రెడ్డి,
పోశమ్మ, రాంబాబు, సింహాద్రి,
బాలకృష్ణ, వ్యవసాయశాఖ ఏడీ ఎస్. శ్యామల, ఎంపీడీవో ఎ.లక్ష్మారెడ్డి, తాహశీల్దార్ కె. లక్ష్మీ కళ్యాణి, గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.







