కర్నూలు (రెడ్ బీ న్యూస్) 13 జనవరి 2022 : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుతున్నాయి. రెండవరోజు స్వామి, అమ్మవార్లు బృంగి వాహనంలో దర్శనమిచ్చారు. అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో బృంగి వాహనంపై స్వామి,అమ్మవార్లు విహరిస్తున్నారు. కోవిడ్ నిబంధనల కారణంగా శ్రీశైలం పురవీధులలో స్వామి, అమ్మవార్ల గ్రామోత్సవాన్ని దేవస్థానం అధికారులు రద్దు చేశారు.







