Updated 28th July 2023 Friday 11:30 pm
Santosh Rao – Sridhar Jail : ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోష్ రావు, ట్రాన్స్ కో సీఎండీ శ్రీధర్ ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు జైలుశిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో న్యాయస్థానం ఇద్దరికి నెల రోజుల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధించింది.
73 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలన్న ఆదేశాలు అమలు చేయక పోవటంపై కోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై అధికారులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. వచ్చే సోమవారం లోపు సరెండర్ అవ్వాలని, ఆ తర్వాత అప్పీల్ పై వాదనలు వింటామని న్యాయస్థానం తెలిపింది.







