UPDATED 26th APRIL 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక రైల్వే స్టేషన్ పరిధిలోని కాకినాడ సిగ్నల్ పాయింట్ సమీపంలో ఒక మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన గురువారం జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ప్రత్తిపాడు మండలం ధర్మవరంకు చెందిన కాపవరపు చిన్ని గత కొన్ని రోజులుగా కడుపునొప్పి తాళలేక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. రైల్వే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని 108 వాహనంలో ఆమెను కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కు తరలించారు.







