Updated 1 February 2022 Tuesday 008:45 PM
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్): ప్రముఖ నటి జయప్రద ఇంట విషాదం నెలకొంది. ఆమె తల్లి నీలవేణి కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ నీలవేణి ఇటీవల హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. తల్లి మృతితో జయప్రద దిల్లీ నుంచి హైదరాబాద్ కి బయలుదేరారు. జయప్రద విజయంలో నీలవేణి పాత్ర ప్రముఖంగా ఉండేది. కెరీర్ పరంగా తన తల్లి ఎంతగానో ప్రోత్సహించేవారని జయప్రద పలు ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే.







