UPDATED 11th JULY 2022 MONDAY 01:20 PM
Trains Canceled : రైళ్ల రాకపోకలపై వర్షాల ఎఫెక్ట్ పడింది. భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు అయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 10 రైళ్లను రద్దు చేశారు. మరో రెండు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు.సికింద్రాబాద్-ఉందానగర్ ప్యాసింజర్, మెము రైలు రద్దు అయింది.
మేడ్చల్-ఉందానగర్, ఉందానగర్-సికింద్రాబాద్ స్పెషల్ రైలును రద్దు చేశారు. సికింద్రాబాద్-ఉందానగర్-సికింద్రాబాద్ స్పెషల్ రైలును రద్దు అయింది. నాందేడ్-మేడ్చల్-నాందేడ్ స్పెషల్ రైలు, సికింద్రాబాద్-మేడ్చల్-సికింద్రాబాద్ రైలు రద్దు చేసినట్లు ప్రకటించారు. కాకినాడ-సికింద్రాబాద్-కాకినాడ రైలు, విజయవాడ-బిట్రగుంట-విజయవాడ మధ్య రైళ్లు రద్దు అయ్యాయి.







