Updated 9th June 2023 Friday 4:40 pm
Jagan-Rayudu: తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) ఇటీవలే క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. తాను రాజకీయాల్లోకి రానున్నట్లు తెలిపాడు. ఏపీ రాజకీయాల్లోకి తనదైన ముద్ర వేసేందుకు తన వంతు ప్రయత్నాలను ప్రారంభించారు. ఏ పార్టీలో చేరే విషయమై ఇప్పటి వరకు రాయుడు చెప్పలేదు. ఇదిలా ఉంటే.. గురువారం(జూన్ 8న) అంబటి రాయుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్(CM Jagan)ను కలిశాడు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాయుడితో పాటు చెన్నై సూపర్ కింగ్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా క్రీడలను ప్రోత్సహించడానికి ఆసక్తిగా ఉన్నట్లు ఈ సందర్భంగా రాయుడు సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. అతడి సూచనల మేరకు పటిష్టమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.







