AP News: న్యాయమూర్తులపై పోస్ట్‌లు.. ట్విట్ట‌ర్‌పై ఏపీ హైకోర్టు సీరియ‌స్!

Updated 31 January 2022 Monday 02:45 PM

అమరావతి (రెడ్ బీ న్యూస్) : హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత పోస్టులు పెట్టిన కేసులో సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్‌పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టాలు, కోర్టులను గౌరవించకపోతే వ్యాపారం మూసుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరించింది.

కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వచ్చే వారంలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది ధర్మాసనం. అభ్యంతరకర పోస్టులను అడ్డుకునేందుకు ఎందుకు సహకరించట్లేదని హైకోర్టు ప్రశ్నించింది.ఇదే సమయంలో విదేశాల నుంచి అనుచితంగా పోస్ట్‌లు చేసినవారిని ఎప్పటిలోగా అరెస్టు చేస్తారో చెప్పాలని సీబీఐని ప్రశ్నించింది.

విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది హైకోర్టు. హైకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులపై కొందరు సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో గతంలో కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us