UPDATED 9th JULY 2017 SUNDAY 9:00 PM
షిర్డీ : గురు పూర్ణిమ సందర్భంగా షిర్డీ సాయిబాబాకు ఆగ్రాకు చెందిన సంధ్యా గుప్తా అనే భక్తురాలు 2 కేజీల బంగారు చెప్పులను కానుకగా సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాయిబాబాకు బంగారు చెప్పులను గురు దక్షిణగా ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. గురు పూర్ణిమ నేపథ్యంలో షిర్డీకి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.







