ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబర్ 2021: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పునరాలోచన లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. పార్లమెంటు ఉభయ సభల్లో ఎంపీల ప్రశ్నలకు కేంద్ర ఉక్కుశాఖ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ప్రైవేటీకరణతో ఉక్కు పరిశ్రమకు పెట్టుబడులు వస్తాయన్న ఉక్కు శాఖ.. ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయని పేర్కొంది.







